
ఉత్తరాఖండ్లో ఆదివారం ఉదయం హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఆ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్ నాధ్ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ మీడియా చెప్తుంది . ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి కేదార్ నాధ్ వెళుతున్న హెలికాఫ్టర్ గౌరీ కుండ అడవి ప్రాంతం లో సడన్గా కుప్ప కూలిపోయినట్లు తెలుస్తుంది . అయితే ఈ ప్రమాదం ప్రతికూల వాతావరణ కారణంగానే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు .
హెలికాప్టర్ ప్రమాదం పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వార స్పందిస్తూ "రుద్ర ప్రయాగ జిల్లాల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇది చాలా విషాదకరం . రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులు అందరి బధ్రత కోసం దేవుడుని ప్రార్థిస్తున్నాను " అంటూ చెప్పుకొచ్చారు . ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది . బ్యాక్ టు బ్యాక్ ఇలా భారత్లో ఘోర ప్రమాదాలు జరుగుతూ ఉండడం అందరికీ ఏదో బ్యాడ్ జరగబోతున్నట్లు సూచిస్తుంది. ఇదే విషయాన్ని ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!