
అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి.. వాళ్లని కొనసాగించడం ఏంటి. ఎప్పుడు ఒకసారి మార్పు జరగాలి.. గతంలో నుంచి మేము ఉన్నాము మేము ఏమి చేయలేమంటే ఎలా అంటే టీటీడీ నేతలను ప్రశ్నించారు బండి సంజయ్. ఇటువంటి పద్ధతి మంచిది కాదని హెచ్చరించారు. భక్తులకు ఎన్ని సౌకర్యాలు కల్పించిన అభివృద్ధి చేసిన కూడా ఇతర మతస్తులు ఈ దేవాలయాలలో ఉండడం వల్ల వాళ్ల ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అవి బయటికి రాకపోవచ్చు .. ఇది అన్ని మతాలకు స్థానం కల్పించడానికి సత్రం కాదు అంటూ ఫైర్ అయ్యారు.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోలేనటువంటి ఆలయాలను పురాతనమైన వంటి వాటిని టీటీడీ అభివృద్ధి చేయాలంటూ సూచించారు. తిరుమలలో నిజమైన భక్తి చిత్తశుద్ధి ఉండే వారికి మాత్రమే అవకాశాలు కల్పించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. అన్య మతస్తులపైన సమగ్ర విచారణ జరిపిన తర్వాతే వారి పైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీటీడీ అనేది ఏ ఒక్కరి ఆస్తి కాదు హిందువులందరికీ అంటూ తెలియజేశారు. సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండాలంటే వెల్లడించారు.