
ఇకపోతే ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇక అభిమానులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రస్తుతం కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మరో రెండు వారాల్లో డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారట వైద్యులు. అతనికి మోకాలు సర్జరీ తో పాటు మరికొన్ని సర్జరీలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక సర్జరీ లు విజయవంతంగా పూర్తి కావడం అతను వేగంగా కోరుకుంటూ ఉండడంతో ఇంటికి తీసుకు వెళ్లేందుకు వైద్యులు అనుమతించినట్లు తెలుస్తోంది.
ఇక పంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు అన్న విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రిహాబ్ సెంటర్లో ఆరు వారాలపాటు రిషబ్ పంత్ ఉంటాడట. ఈ మేరకు బీసీసీఐ అధికార వర్గాల నుంచి సమాచారం అయితే అతను పూర్తిగా గాయాలనుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే యాక్సిడెంట్ కారణంగా అతను ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ తో పాటు ఐపీఎల్ కు కూడా దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.