ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఇక ఇప్పుడు ఐపీఎల్ 16వ సీజన్లోనూ అదే రీతిలో హవా నడిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే పదహారేళ్ల ఐపీఎల్ హిస్టరీలో 12సార్లు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన ఏకైక జట్టుగా అటు చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డును సృష్టించింది. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 223 పరుగుల భారీ స్కోరు చేసిన చెన్నై ఇక తర్వాత ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడంలో సక్సెస్ అయ్యింది.




 అయితే ఇక ఈ మ్యాచ్ లో మరోసారి అభిమానులకు ధోని ఆటను చూసే అవకాశం లభించింది అన్న విషయం తెలిసిందే. ఇక చివరి ఓవర్ మిగిలి ఉన్నప్పుడు ధోని బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు  అయితే ధోని ఈ మ్యాచ్ లో ఆడింది కేవలం ఐదు బంతులు మాత్రమే.  ఈ ఐదు బంతుల్లో అతను చేసింది కేవలం నాలుగు పరుగులు.. అయినప్పటికీ స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మారుమోగిపోయింది అనడంలో సందేహం లేదు. అయితే అసలు మ్యాచ్ జరుగుతుంది ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అయినా అరుణ్ జైట్లీ స్టేడియంలో కానీ అక్కడ సపోర్టు మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ కే ఉంది అని చెప్పాలి.


 ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఢిల్లీ అభిమానులు సైతం సీఎస్కే జెర్సీ వేసుకొని చెన్నై జట్టుకు మద్దతు పలికారు. అయితే ఇక ధోని  మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే చాలు అటు అభిమానులు అందరూ కూడా ధోని నామస్మరణతో పరవశించిపోతున్నారు అని చెప్పాలి  ఇక ధోని క్రేజ్ ముందు ప్రత్యర్థి బౌలర్లు సరైన బంతులు వేయడంలో విఫలమవుతున్నారు. ఇటీవల ఢిల్లీతో మ్యాచ్ సమయంలో ఇది మరోసారి నిరూపితమైంది. చెన్నై ఇన్నింగ్స్ సమయంలో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు చేతన్ సకారియా. ధోని అభిమానుల అరుపులతో అతను ఒత్తిడికి గురయ్యాడు. చివరి రెండు బంతులు వేయాల్సిన సమయంలో ఒకటి నోబాల్ మరొకటి వైడ్ బాల్ వేశాడు. ఎందుకురా బాబు నాకు ధోనికి బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది అని లోలోపల అనుకుంటూనే భయపడుతూ బంతులు వేశాడు. దీనికి అంతటికి కారణం ధోని. ఇలా ధోని క్రేజ్ ముందు బంతులు వేయడానికి కూడా భయపడిపోతున్నారు బౌలర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: