ఇండియాలో ఓ బిచ్చగత్తె గా పరిచయం ఐన మహిళా రాణి మండల్ ఓ స్టార్ రేంజ్ ని అందుకుంది. ఆమె ఇప్పుడు ఓ పాపులర్ గాయని మరియు సీరియల్ ఆర్టిస్ట్ మరియు ఓ పెద్ద సెలెబ్రెటీ. ఇదంతా ఒక్క వీడియో వైరల్ అవ్వడంతో ఇది సాధ్యమైంది అయితే ఇలాంటి సంఘటనే ఫిలిప్పీన్స్లోని లుబ్కాన్లో వినువీధుల్లో చోటుచేసుకుంది . ఫిలిప్పీన్స్లోని వీధుల్లో బిక్షాటన చేస్తున్న ఓ బిచ్చగత్తె ను చూశాడు ఓ ఫోటో గ్రాఫర్. అందరు ఆమె వేషధారణ చుస్తే అతను ఆమెలోని సౌందర్యం ను గుర్తించాడు. ఆలా అనిపించడమే తరువాయి టోఫర్ అనే ఫొటోగ్రాఫర్ ఆమె ఫోటో ను క్లిక్ మనిపించాడు.
ఆ ఫోటో గ్రాఫ్ ని చూసిన ప్రతి ఒక్కరు ఆమెగురించి ఆరాతీయడంతో ఆమె ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఫిలిప్పీన్స్ నగరంలో ఆమె ఓ తారగా వెలిగింది. ఆమెకు పెరిగిన పాపులారిటీని కొందరు సొమ్ముచేసుకోగా. కొన్ని కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది. ఆమె పేరు రీటా గవియోలా . ఆమె భిక్షాటన చేస్తే గాని పూట గడవని ఆ భిక్షగత్తె ఇప్పుడు కోట్లు సంపాదిస్తుంది. ఇక ఆమె పరసనల్ వివరాలలోకి వెళితే ఫిలిప్పీన్స్ నగరానికి చెందిన ఆమె ఓ భిక్షగత్తె. ఆమె త్రండి ఓ పారిశుధ్య కార్మికుడు. తన తల్లి కూడా బిక్షాటన చేసేది. వీరి జీవనం మురికి వాడల్లో మగ్గుతూ ఉండేది. అయితే టోఫర్ ఫొటోగ్రాఫర్ పుణ్యమా అని ఆమె ఇప్పుడు ప్రపంచ స్థాయి మోడల్ అయ్యింది. కొన్ని కోట్లకు అధిపతి ఇప్పుడు ఆమె. ప్రస్తుతం తనకు ఇంత సహాయం చెసిన ఆ టోఫర్ కు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ఉంది.