తెలంగాణ ఖాతాలో మరో అవార్డు దఖలు పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో   ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలంగాణకు అవార్డు ఇచ్చింది. ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన డిజిటెక్‌ కాంక్లేవ్‌లో తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ అవార్డును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అందుకున్నారు. ‘మీ సేవ’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు ఈ గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ఎకనామిక్ టైమ్స్ ప్రశంసించింది.


ఢిల్లీలో జరిగిన ‘డిజిటెక్‌ కాంక్లేవ్‌ 2022’లో తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన మంత్రి కేటిఆర్... ఈ అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ చెబుతోంది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్‌ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్‌ సేవలను అందిస్తున్నందుకు గానూ తెలంగాణ ప్రభుత్వానికి ఈ అవార్డు ఇస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్  ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై   విస్తృతమైన  పరిశోధన చేసిన ఎకనమిక్‌ టైమ్స్‌  పత్రికకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: