ఢిల్లీలో జరిగిన ‘డిజిటెక్ కాంక్లేవ్ 2022’లో తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన మంత్రి కేటిఆర్... ఈ అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ చెబుతోంది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్నందుకు గానూ తెలంగాణ ప్రభుత్వానికి ఈ అవార్డు ఇస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన పరిశోధన చేసిన ఎకనమిక్ టైమ్స్ పత్రికకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీలో జరిగిన ‘డిజిటెక్ కాంక్లేవ్ 2022’లో తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన మంత్రి కేటిఆర్... ఈ అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ చెబుతోంది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్నందుకు గానూ తెలంగాణ ప్రభుత్వానికి ఈ అవార్డు ఇస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన పరిశోధన చేసిన ఎకనమిక్ టైమ్స్ పత్రికకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.