1962, ఆగష్టు 25 న బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ లో జన్మించింది. ముస్లిం కుటుంబంలో పుట్టి, ముస్లింగా పెరిగినప్పటికీ చదువు, వయస్సు పెరిగే కొద్దీ ఆమె హేతువాదిగా, నాస్తకురాలిగా మారింది. 1994 వరకు ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసింది. 1990 నుండి తన అభ్యుదయవాద రచనలతో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. 1994లో స్వేచ్ఛా అభిప్రాయాలకు గాను యూరోపియన్ పార్లమెంటు నుంచి సఖరోవ్ బహుమతిని, 1996లో మానవతా అవార్డు పొందింది. ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపినందుకు ఇస్లాం లేఖనాలను విమర్శించినందుకు 1993 నుంచి ఇస్లాం ఛాందసవాదులు ఆమెను చంపాలని చూస్తున్నారు.
2007లో ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాదులో ఒక రచయితల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సందర్భంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఇస్లాం చాందసవాదులు ఆమెపై దాడిచేశారు. సెప్టెంబర్ 2007 లో పశ్చిమ బెంగాల్లో ఆమెను భారతదేశం నుంచి బహిష్కరించాలని ప్రదర్శనలు చేశారు. ఆమెకు భారత పౌరసత్వం ఇవ్వొద్దని ఇలాంటి వర్గాలే కోరుతున్నాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతిస్పందింస్తూ బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు జరిపిన దాడులకు వ్యతిరేకంగా వ్రాసిన లజ్జా అనే నవల కూడా చాలా వివాదాస్పదమయ్యింది. ఆమెకు రచనలను కొనియాడుతూ ప్రపంచంలోని చాలా దేశాలు, సంస్థలు ఆమెను అవార్డులు, రివార్డులతో సత్కరించారు. ఆమెకు బాగా పేరు తెచ్చిన నవలల్లో లజ్జ ప్రధానమైందని చెప్పాలి. ఇందులో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరిగిన దాడులను ఆమె చర్చించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి