పండుగ సమయాల్లో రైల్వే స్టేషన్​లో రద్దీని తగ్గించే దిశగా దక్షిణ-పశ్చిమ రైల్వే ఫ్లాట్​ఫామ్​ టికెట్​ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రూ.10 గా ఉన్న టికెట్​ ధర రూ.50 కానుంది. అయితే ఈ నిర్ణయాన్ని కేవలం 13 స్టేషన్​లకు మాత్రమే పరిమితం చేశారు రైల్వే అధికారులు.పెరిగిన ధరలు నవంబర్​ 10నుంచి అమల్లోకి రానుండగా... పండుగ సీజన్​లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ-పశ్చిమ రైల్వే సన్నాహాలు చేస్తోంది.


టికెట్​ రేటు పెరిగిన స్టేషన్లు...కృష్ణరాజపురం, బంగారుపేట, తుంకూర్​, హోసూర్​, ధర్మపురి, కెంగేరి, మండ్య, హిందూపుర్​, పెనుగొండ, యెలహంక, బనస్వాడి, కార్మెలారమ్​, వైట్​ఫీల్డ్​.పండుగ సీజన్​లో రైల్వే స్టేషన్​ వద్ద రద్దీని అరికట్టేందుకు దక్షిమ-పశ్చిమ రైల్వే ఫ్లాట్​ఫామ్​ టికెట్​ వెలను పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో టికెట్ ధర రూ.10 నుంచి రూ.50 కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: