పండుగ సమయాల్లో రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించే దిశగా దక్షిణ-పశ్చిమ రైల్వే ఫ్లాట్ఫామ్ టికెట్ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రూ.10 గా ఉన్న టికెట్ ధర రూ.50 కానుంది. అయితే ఈ నిర్ణయాన్ని కేవలం 13 స్టేషన్లకు మాత్రమే పరిమితం చేశారు రైల్వే అధికారులు.పెరిగిన ధరలు నవంబర్ 10నుంచి అమల్లోకి రానుండగా...
పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ-పశ్చిమ రైల్వే సన్నాహాలు చేస్తోంది.
టికెట్ రేటు పెరిగిన స్టేషన్లు...కృష్ణరాజపురం, బంగారుపేట, తుంకూర్, హోసూర్, ధర్మపురి, కెంగేరి, మండ్య, హిందూపుర్,
పెనుగొండ, యెలహంక, బనస్వాడి, కార్మెలారమ్, వైట్ఫీల్డ్.పండుగ సీజన్లో రైల్వే స్టేషన్ వద్ద రద్దీని అరికట్టేందుకు దక్షిమ-పశ్చిమ రైల్వే ఫ్లాట్ఫామ్ టికెట్ వెలను పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో టికెట్ ధర రూ.10 నుంచి రూ.50 కానుంది.