తిరుపతి వెంకటేశ్వరుని బంగారు కళ రాబోతోంది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు త్వరలో ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 23 వ తేదీన బాలాలయం నిర్వహించేలా ముహూర్తం ఖరారు చేశారు. శ్రీవారి మూలవిరాట్టుకు నిత్య సేవలు నిర్వహణ, భక్తుల దర్శనం యధావిధిగా కొనసాగుతుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

గతంలో 1957, 1958 సంవత్సరంలో శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు జరిగాయి. అప్పుడు జరిగినట్టే ఈసారి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు హుండీలో సమర్పించిన స్వర్ణ కానుకలతోనే ఆనందనిలయానికి బంగారు తాపడం చేయాలని టీటీడీ నిర్ణయించింది.  సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని జనవరి 2వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరుస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. గత ఏడాది లాగానే పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వారాలు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: