అందుకే అప్పట్లో ఆయన ఒక్కసారిగా మూడు నెలలు అనే మాట ఎత్తకుండా మొదట చిన్న ప్రయత్నంగా ఒక్కరోజు ఉంచి, అలా మెల్లిగా అలవాటు పడనిచ్చి, అనంతరం మూడు నెలలు లాక్ డౌన్ విధించారు. అయినా ఎవరు కూడా ఈ మాటలు పట్టించుకుని భారతీయులు సహకరిస్తారు అనే నమ్మకం ప్రపంచానికైతే లేదు, కానీ దానిని సాధించి చూపించారు భారతీయులు. ఈ తరహా స్పందన భారతీయులు కూడా అసలు ఊహించారు. అంతగా మూడు నెలలు విజయవంతంగా గడిచింది. అయితే అందులో కూడా ఒకేఒక చిన్న బాధాకరమైన విషయం వలస కూలీలకు సరైన ఏర్పాట్లు చేసి ఈ పని చేయాల్సింది అనేది. ఆ ఒక్కటి అప్పట్లో జరిగి ఉంటె, అంతా బాగున్నట్టే.
ఇలా మొదటి మెట్టు బాగా విజయవంతం కావడంతో, ప్రపంచం విస్తుపోయి దేశంవైపు చూసింది. అక్కడే మరో తడబాటు, వెంటనే అందరు సాధారణ స్థితికి వచ్చేశారు, రెండో వేవ్ విజృంభించింది. భారత్ ఈ సరైన అయిపోతుంది అనుకున్నారు చాలామంది. కానీ కాస్త పాఠాలు నేర్చుకొని బయటపడింది. అయినా ఈ పరిస్థితులలో కూడా ఆర్థికవృద్ధి రేటు 8.3 శాతం ఉంటుంది అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే కరోనా రెండో వేవ్ తట్టుకొని నిలబడిన భారత్ కు ఈ వృద్ధిరేటు తక్కువ ఏమి కాదని ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.