లోకం తీరు మారుతుంది అందరూ నాగరిక సమాజం లోకి అడుగు పెడుతున్నారు.. మూఢనమ్మకాలను వదిలేసి మానవతా దృక్పథంతో అందరూ ఒకటే అన్న విధంగా మెలుగుతున్నారు.. ఇవన్నీ కేవలం కొటేషన్ లో కనిపించే మాటలు మాత్రమే.. ఎందుకంటే ఇంకా మనిషి నాగరిక సమాజంలో అడుగు పెట్టకుండా అనాగరికత ను పట్టుకుని  వేలాడుతున్నాడు అన్న విషయం ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఘటనలు అద్దం పడుతున్నాయి. మనిషి ఆ ఆలోచన తీరు ఇంకా వెనకబడి ఉంది అన్న నిజం అందరికీ అడుగడుగున తారసపడుతుంది.



సభ్య సమాజం మొత్తం నాగరికత వైపు అడుగులు వేసి పరుగులు పెడుతుంటే.. ఇప్పటికీ ఎంతోమంది అనాగరిక జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా నేటి రోజుల్లో కులం మతం అనేది ఇంకా సభ్య సమాజంలో దారుణంగా పేరుకుపోయి ఉంది అని చెప్పాలి. అదే సమయంలో మహిళల మీద వివక్ష కూడా రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఓ మైనర్ బాలిక కు అమానవీయ అవమానం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లి పోయింది అన్న అనుమానం ఏకంగా ఆ పేరెంట్స్ ని మానవత్వం లేని మనుషులుగా మార్చేసింది.



 అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విషయంలోనే కర్కశంగా ప్రవర్తించి దారుణంగా వ్యవహరించారు  ఆ తల్లిదండ్రులు. ప్రేమించిన వ్యక్తితో పారిపోయిన కారణంతో ఓ మైనర్ బాలికకు అవమానకరమైన శిక్ష విధించారు తల్లిదండ్రులు. ఈ ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా బాలికకు గ్రామస్తులు అందరూ కలిసి గుండు గీయించి ముఖానికి నల్లటి రంగు పూసి ఊరంతా ఊరేగించారు. అవమానాన్ని తట్టుకోలేక ఆ బాలిక అరణ్యరోదనగా విలపిస్తున్నా.. గ్రామస్తుల మనసు మాత్రం కరగలేదు. బాలిక  ప్రేమించిన వ్యక్తితో పారి పోవడం వల్ల తమ తెగకు చెడ్డ పేరు వచ్చిందని  అందుకే ఆమెని శుద్ధి చేసేందుకే ఇలాంటి పని చేశాము అంటూ చెప్పుకుంటున్నారు అక్కడి గ్రామస్తులు. ఇక ఇదంతా జరిగిన తర్వాత అదే వర్గానికి చెందిన మరో అబ్బాయితో ఆ బాలిక పెళ్లి చేశారు. అంతేకాదు తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ బాలిక ప్రియుడిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: