ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా దాంపత్య బంధంలో అన్యోన్యత కాదు మనస్పర్ధలు ఎక్కువై బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాధారణంగా  భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడే భార్య భర్తల బంధం మరింత బలపడుతుందని చెబుతూ ఉంటారు.


 కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది భార్య భర్తల బంధం లో తలెత్తిన చిన్నపాటి గొడవలు పెద్దగా మార్చుకుంటూ మాటామాటా పెరిగి పోవడంతో చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్షణికావేశంలో  నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఏకంగా సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.. ఇక ఇటీవల ఓ మహిళ కూడా భర్తతో గొడవపడింది. దీంతో ఏకంగా సెల్ ఫోన్ టవర్ ఎక్కి చనిపోతాను అంటూ హల్ చల్ చేసింది.



 కాని చివరిలో ఊహించని ట్విస్టు చోటు చేసుకోవడంతో దెబ్బకు సెల్ ఫోన్ టవర్ దిగివచ్చింది సదరు మహిళ  ఈ ఘటన కేరళ లో జరిగింది. ఓ మహిళకు భర్తతో గొడవ జరగడంతో ఇక బిడ్డను భార్యకు ఇచ్చేందుకు సదరు భర్త నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయింది. ఎలా సూసైడ్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో టవర్ ఎక్కితే సరిపోతుంది కదా అని భావించింది. దీంతో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కింది. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులు ఎంత బతిమిలాడినా కిందకు దిగలేదు. అయితే టవర్ ఎక్కే క్రమంలో అక్కడే ఉన్న కందిరీగలా తొట్ట కదిలింది. చివరికి ఆమెను చుట్టుముట్టటడంతో  దెబ్బకి భయంతో గట్టిగా అరుస్తూ టవర్ దిగింది సదరు మహిళ..

మరింత సమాచారం తెలుసుకోండి: