
ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ లో ప్రస్తుతం గుబులు మొదలైంది. ఇటీవల పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులపై వస్తున్న ఆరోపణలు, వ్యతిరేక కథనాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఇద్దరు సీనియర్ నేతలను రంగంలోకి దింపారు. వీరు 48 గంటల్లో క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల ఓ మంత్రి మీద వచ్చిన ఆరోపణలు సంచలనం రేపాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ కాంట్రాక్టర్కు ఎలాంటి నిబంధనలు లేకుండా భారీ స్థాయిలో కాంట్రాక్టులు అప్పగించి దాదాపు 50 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సమాచారం. ఈ విషయంలో టీడీపీకి అత్యంత అనుబంధంగా ఉండే ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయంపై అప్పట్లో సీఎం చంద్రబాబు స్పందించినా... మంత్రికి కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టారన్న ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడిది మాత్రమే కాకుండా గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై కూడా అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. పత్రికలతో పాటు టీవీ ఛానళ్లలోనూ ఈ విషయాలు హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా మారడంతో చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఈ వివాదాల వెనుక అసలు కారణం ఏమిటనేది పార్టీ వర్గాల్లో మిశ్రమ అభిప్రాయాలను తెరపైకి తెస్తోంది. కొంతమంది నేతల అభిప్రాయం ప్రకారం, కూటమిలోని కొందరు సభ్యులు తమ స్వార్థాలకు అనుగుణంగా మీడియా ద్వారా వ్యతిరేక వార్తలను లీక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుండి టీడీపీలో చేరిన కొన్ని వ్యక్తులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు అంతర్లీనంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, మరికొందరు నేతలు మాత్రం ఈ వార్తల్లో వాస్తవం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, అవి బయటపడుతున్నాయనే కారణంగా ఈ కథనాలు వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారు. ఇది ప్రభుత్వ పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు భావిస్తున్నారు. మొత్తానికి, టీడీపీలో పరిస్థితి క్లిష్టంగా మారింది. అధికారంలో ఉన్నపుడు పార్టీపై ఇలాంటి ఆరోపణలు రావడం నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇక చంద్రబాబు చేపట్టిన ఈ వేగవంతమైన విచారణ ద్వారా నిజాలేమిటో బయటకు వస్తాయా ? రావా ? అన్నది ఆసక్తికర అంశంగా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు