నలభై రెండు దేశాలు, వివిధ రాష్ట్రాలలోని 110 తెలుగు సంఘాలు ఒక్కటైతే.. గానకోవిదులు, సాహితీ వేత్తలు, రాజకీయ సినీ రంగ ప్రముఖలు..ఒకే వేదికను పంచుకుంటే.... సరిగ్గా అదే జరిగింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఒక వైపు, ఒకరినొకరు ముఖాముఖి కలిసేందుకు అడ్డువచ్చే కోవిడ్-19 మరోవైపు..... ఈ నే పధ్యంలో గత ఏడాది దివికేగిన గాన గాంధ్వర్వుడు పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ( ఎస్.పి.బి)వర్ధంతి సభ విశ్వగాన గాంధర్వ -2021 పేరుతో ఆన్ లైన్ లో జరిగీంది. సినీ రచయితలు తనికేళ్ల భరణి, సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, తదితరులు బాలసుబ్రమణ్యంతో తమకున్న అభూతులను పంచుకున్నారు.
ఈ కారక్యమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో ఎస్.పి. బాలసుబ్రమణ్యం గుణ గణాలను సభకు వివరించారు. ఆయనకు పెద్దలంటే ఎంతో గౌరవమని, ఆయన కనబర్చిన అణకువ, వినమ్రతల చాలా గొప్పవన్నారు. తెలుగు రాని వారు ఎందరో కథానాయకులుగా సినీ పరిశ్రమకు అడుగు పెడితే వారికి తన గొంతుకను అరువుగా ఇచ్చారని, ఒక విధంగా చెప్పాలంటే వారిలోకి ఎస్.పి.బి పరకాయ ప్రవేశం చేశాడని ఉపరాష్ట్రపతి చెప్పారు. వివిధ భాషల్లో వేలాది పాటలు పాడిన ఆయన భారత దేశంలోని చాలా కుటుంబాలలో, ఇంకా చెప్పాలంటే వారి జీవితాలలో చోటు సంపాదించుకున్నారని, ఒక భాగమయ్యారని తెలిపారు.