
ఉదయం లేచిన వెంటనే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగండి. ఇది శరీర డీటాక్సిఫికేషన్కు ఉపయోగపడుతుంది, జీర్ణవ్యవస్థను ఉద్దీపన చేస్తుంది. శరీరంలోని అలసట, టాక్సిన్లు బయటకు పోతాయి, మనస్సు లైట్గా ఉంటుంది. నాకు ఇది ఉంది”, “నేను ఆరోగ్యంగా ఉన్నాను”, “నాకు కుటుంబం ఉంది” అనే అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ ఉదయం 2–3 అంశాలకు గాను కృతజ్ఞత చెప్పడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఉదయం చిన్న యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల నాడీ వ్యవస్థ చురుకుగా మారుతుంది. ఇది మూడ్ను లైట్గా, మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. సుర్యనమస్కారాలు, భుజంగాసనం, శవాసనం వంటి సాదా ఆసనాలు.
శాంతి భరితమైన సంగీతం లేదా భక్తిగీతాలు మనస్సుకు విశ్రాంతిని ఇస్తాయి. ఉదయాన్నే అలా స్నేహంగా సౌండ్ వాల్యూమ్తో కీర్తనలు లేదా మృదువైన వాయిద్య సంగీతం వినడం ద్వారా నాడీ శక్తి ఉత్తేజితం అవుతుంది. ఉదయం 10 నిమిషాల ధ్యానం ఒత్తిడిని చాలా తక్కువ చేస్తుంది.“ఒక పదం మీద దృష్టి పెట్టడం” వంటి సులభమైన పద్ధతులే సరిపోతాయి. శరీరం, మనస్సు శాంతించడంతో పాటు ఆ రోజంతా సమతుల్యంగా గడుస్తుంది. లేవగానే మొబైల్ చూడటం, మెసేజ్లు, న్యూస్ ఫీడ్స్ చూసేయడం మానసిక ఒత్తిడికి పునాది వేస్తుంది. ఉదయం మొదటి అరగంట "మీ కోసం" కేటాయించండి — ఫోన్, టీవీ, సోషల్ మీడియా వదిలేసి.