అంటే వస్త్రాలు, బంగారం, ఫుడ్, ఈవెంట్ మేనేజ్మెంట్, హోటల్స్, ట్రావెల్, డెకరేషన్ - అన్నీ రంగాల్లో దుమ్మురేపే వ్యాపారం. పెళ్లిళ్ల సీజన్ అంటే వ్యాపారులకు పండుగే! ఇక ఈసారి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే – స్వదేశీ డెస్టినేషన్ మ్యారేజీలు హాట్ టాపిక్గా మారాయి. గతంలో సంపన్నులు థాయ్లాండ్, బాలీ, యూరప్ వంటి విదేశీ ప్రదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న కుటుంబాల్లో 80–85 శాతం మంది స్వదేశీ డెస్టినేషన్ మ్యారేజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు. “దేశంలోనే పెళ్లిళ్లు జరుపుదాం, మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది” అని మోడీ చెప్పిన సందేశం ఇప్పుడు ఫలితాలను ఇస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
రాజస్థాన్ ప్యాలెస్లు, గోవా రిసార్టులు ఎప్పటిలానే హాట్ స్పాట్స్గా ఉంటూనే, కొత్తగా వయనాడ్, కూర్గ్, రిషికేష్, సోలన్, షిల్లాంగ్ వంటి ప్రదేశాలు కూడా పెళ్లి వేదికలుగా గుర్తింపుపొందుతున్నాయి. వీటిలో ప్రకృతి అందాలు, విలాసవంతమైన వసతులు, సాంస్కృతిక వాతావరణం కలగలిసి మధురమైన పెళ్లి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పెళ్లిళ్ల ఖర్చుల విషయంలోనూ భారతీయులు వెనుకడుగు వేయడం లేదు. 2022లో 32 లక్షల పెళ్లిళ్లకు రూ.3.75 లక్షల కోట్లు ఖర్చయితే, 2023లో 38 లక్షల పెళ్లిళ్లకు రూ.4.74 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. 2024లో జరిగే 48 లక్షల వివాహాల ఖర్చు దాదాపు రూ.5.9 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. మొత్తానికి, ఈ పెళ్లిళ్ల సీజన్ దేశవ్యాప్తంగా ఆర్థిక ఉత్సవంగా మారబోతోంది. వ్యాపారాలకు జోష్, ఆర్థిక వ్యవస్థకు బూస్ట్, ప్రజలకు ఆనందం – ఇలా పెళ్లిళ్ల సీజన్ దేశానికి నిజంగా సెలబ్రేషన్ ఆఫ్ ప్రాస్పరిటీ!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి