హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గురించి మనందరికీ తెలిసిందే.ఇక  ఈ ముద్దమందా కెరియర్ బిగినింగ్ లోనే పవన్ కళ్యాణ్, నాగచైతన్య, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు శిరీష హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని విజయం నిర్మించారు.  ఈ సినిమా రేపు అనగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. 

ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అను ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.అయితే  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కెరియర్ లో ప్రతి అడుగు కూడా మంచి స్థాయికి తీసుకెళ్లాలి అన్న ఆలోచన ఉంటుంది.ఇకపోతే  ఈ సినిమాలో సింధు పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు సింధుకి ఉన్న పోలిక అని అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. అంతేకాదు అలాగే ఈ సినిమాలో అల్లు శిరీష్ హీరో అని నాకు ముందే తెలుసు... నేను పూజ రోజున మొదటి సారి కలిశాను. అయితే డైరెక్టర్ కథ మొత్తం వినిపించిన తర్వాత నేను అల్లు శిరీష్ కాఫీ షాప్ లో కూర్చుని వార్తలు గురించి మాట్లాడుకున్నాము.

 ఇక ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాము.... శిరీష్ గుడ్ కోస్టార్. డైరెక్టర్ రాకేశ్ శశి కూడా డెడికేటింగ్ పర్సన్. ఇక ఒక షాట్ ఇలా రావాలి అంటే అలా వచ్చే వరకూ వదిలిపెట్టడు. అంతేకాదు  అతని డెడికేషన్, ఓర్పు, కథ చెప్పిన తీరుతోపాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూ కూడా నేను ఈ సినిమా చేయడానికి కారణం అని చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్.  ఆమె మాట్లాడుతూ అనూ కళ్ళతో అభినయించగలదు అనే గుర్తింపుని నేను సంపాదించుకున్నాను.ఇక  కొన్ని సినిమాల రిజల్ట్ చూసిన తర్వాత నన్ను నేను మార్చుకున్నాను. కాగా రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటున్నాను. ఇక వచ్చిన అవకాశంలో ఆ పాత్రకు నేను సూటు అవుతాను అనుకుంటూనే ఓకే చేస్తున్నా.... లేదంటే ఇంట్లో కూర్చుంటా సక్సెస్ నా చేతిలో లేదు. ఇక ఈ సినిమాలో పాత్రకు నేను సూట్ అవుతాను అనుకున్నాను అందుకే ఓకే చేశాను అని చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: