తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి ,  గీత గోవిందం , టాక్సీ వాలా వంటి మంచి విజయవంతమైన మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం విజయ్ దేవరకొండ "లైగర్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా లైగర్ మూవీ రూపొందింది. భారీ అంచనాల నడుమ కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఖుషి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నార్వన ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ నుండి  చిత్ర బృందం కొంత కాలం క్రితమే ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్o విజయ్ దేవరకొండ మరియు సమంత లుక్ డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఖుషి మూవీ షూటింగ్ ఇంకో 5 వారాలు బ్యాలెన్స్ ఉన్నట్లు ,  ఈ 5 వారాల షూటింగ్ జరిగినట్లయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: