
బంగార్రాజు : ఈ ఏడాది ఆరంభంలోనే అక్కినేని మల్టీ స్టారర్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసింది. నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య కలిసి సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాలో నటించారు. జనవరి 14న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా హిట్టు కొట్టింది.
త్రిబుల్ ఆర్ : బాహుబలి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత జక్కన్న చెక్కిన కళాఖండం త్రిబుల్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ సాధించి.. ఎన్నో అవార్డులను కూడా సాధించే పనిలో ఉంది.
భీమ్లా నాయక్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయింది. సితార ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎఫ్ త్రీ : నవ్వుల సునామీగా సెన్సేషన్ హిట్ సాధించిన ఎఫ్2కి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3 సినిమా సినిమా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అయితే ఇక ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
గాడ్ ఫాదర్ : ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చారు చిరంజీవి. మలయాళ సూపర్ హిట్ అయిన లూసిఫర్కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా.. సినిమాలో చిరంజీవితో పాటు అటు సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.
ఓరి దేవుడా : యువ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓరి దేవుడా సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా ఇక యూత్ ని బాగా ఆకర్షించి మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.
ఆచార్య : ఈ ఏడాది భారీ మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా ఎందుకో అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు చరణ్ కలిసి నటించారు.