టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలకు వాళ్ళ అభిమానుల నుండి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా మల్టీస్టారర్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ లో రాణిస్తున్న హీరోలందరూ కూడా మల్టీ స్టార్ సినిమాలో చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ ఇద్దరు కలిసి బ్రో అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు.మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

ఓకే ఫ్రేమ్లో వీరిద్దరూ కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దేవుడు భక్తుడు కాన్సెప్ట్ తో ఈ సినిమాని వినోదయ సీతం సినిమాకు బ్రో రీమేక్ గా తెరకేకిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను ఫిబ్రవరిలో మొదలుపెట్టారు. మొదలుపెట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ను మొత్తంగా పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు సాయి ధరంతేజ్ కి సంబంధించిన షూటింగ్ను ఫేమస్ స్టూడియోలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది .

ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం ఇందులో భాగమయ్యారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. దీంతో ఈ సినిమా శాటిలైట్ రైట్ కు అప్పుడే భారీ స్థాయిలో డిమాండ్ కూడా వస్తుంది. అయితే తాజాగా ఈ హక్కులను జీ తెలుగు సంస్థ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను చెల్లించిందట .ఆ చానల్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక భారీ ధరకు కొనుగోలు చేసిన అతి తక్కువ సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటిగా నిలిచింది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: