ప్రేమికుల రోజు వచ్చిందంటే ఎంతో మంది ప్రేమికులకు ఒక తీపి జ్ఞాపకం. ప్రేమికుల రోజున ఎంతోమంది తమ  మనసు లోని ప్రేమను బయటకు చెప్పి  తమ ప్రేయసితో ప్రేమకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు తమ ప్రియమైన వారికి సర్ప్రైస్  ఇస్తూ ఉంటారు. ఇలా ప్రేమికుల రోజు అంటే ఒక్కొక్కరికి ఒక్కో తీపి జ్ఞాపకం ఉంటుంది. అటు సెలబ్రిటీలకు కూడా ప్రేమికుల రోజున ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఇక్కడ ఓ హీరోయిన్ కు ప్రేమికుల రోజున అలాంటి ఓ మధుర జ్ఞాపకమే ఉందట. ప్రస్తుతం ప్రేమికుల రోజున తనకు గుర్తొచ్చే సంఘటన గురించి అభిమానులతో పంచుకుంది  ఇక్కడొక ముద్దుగుమ్మ. 

 

 ప్రేమం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మడోన్నా సెబాస్టియన్ తనకు ప్రేమికుల రోజున గుర్తొచ్చి ఒక ఆసక్తికర కథ గురించి అభిమానులతో పంచుకున్నారు.నాగచైతన్య హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమా ప్రేమమ్ సినిమా  తమిళ హిట్ మూవీ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటి మడోన్నా సెబాస్టియన్ నటించిన విషయం తెలిసిందే. అయితే నటి మడోన్నా సెబాస్టియన్ స్కూల్లో చదువుతున్న సమయంలో... తన క్లాస్ విద్యార్థి పక్క క్లాస్ లో ఉండే అమ్మాయిని ప్రేమించాడు అని తెలిపింది ఈ అమ్మడు. 

 

 ఇద్దరు రోజు చూసుకునే వారని చూపులతోనే సైగలు చేసుకునేవారు తప్ప డైరెక్ట్ గా మాట్లాడుకునే వారు కాదు అంటూ తెలిపింది. దీంతో మేమంతా ప్రేమికుల రోజున కలుసుకొని ప్రేమను వ్యక్తం చేసుకోవాలి అంటూ వారిద్దరికి చెప్పి ఒప్పించాము అంటూ చెప్పుకొచ్చింది. వారిద్దరూ ఒకరి ప్రేమ ఒకరు చెప్పుకోవడానికి వారిద్దరిని ఒక హోటల్కి తీసుకెళ్ళమని  మాట్లాడుకోవాలని చెప్పాము అంటూ వివరించింది. అయితే ఓకే దగ్గర కూర్చున్న వారిద్దరూ ప్రేమ గురించి మాట్లాడుకోకుండా తిన్నావా ఈ మధ్య ఏ సినిమా చూసావు  అనే మాటలు మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. చివరికి వారిద్దరూ తమ ప్రేమ గురించి మాట్లాడుకోకుండా నే అక్కడి నుంచి వెళ్లిపోయారు అంటూ తెలిపింది. దీంతో ఈ ఘటన జీవితాంతం తనకు గుర్తుండి పోయిందని ఈ అమ్మడు తెలిపింది . ప్రతి ప్రేమికుల రోజు నాడు ఈ ఘటన గుర్తొస్తుంది అంటూ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: