స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్కల మాస్టార్‌ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం ‘పుష్ప’. బన్నీ-సుకుమార్ కాంబోకు తెలుగులో మంచి క్రేజ్‌ ఉండగా.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూడో చిత్రానికి అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ కొత్త లుక్. గుబురు గడ్డం, చెదిరిన జుట్టుతో.. తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించి.. పక్కా మాస్ లుక్‌లో ఉన్నాడు బన్నీ. అసలే లాక్ డౌన్ మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల గురించి ఒక్క అప్ డేట్ లేక తెగ బాధపడిపోతున్నారు. ఈ సమయంలో తమ అభిమాన హీరో కొత్త లుక్క చూసి తెగ సంబరపడిపోయారు.  పోలీసులందరినీ చితకబాది వారి జీపులోనే విసిరి దాని ముందు భాగంలో ఎక్కి కూర్చుని ఉన్నాడు.

 

ఈ లుక్ చూసిన బన్నీ ఫ్యాన్ ఎవరైనా ఫిదా అయిపోతారు.  ఇక ఈ చిత్రం గురించి భారీ భారీ అంచాలు వేసుకుంటున్నారు.  కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందన్న విషయం తెలియదు. ఈ లుక్ నిజంగా కొత్తగా తెరకెక్కుతున్న సినిమాలోనిది కాదు. బన్నీ వీరాభిమాని ఎవరో సృష్టించినది. ఇదిలా ఉంటే మొదట ఈ మూవీ చిత్రీకరణలోని కొన్ని సీన్లను థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో తెరకెక్కించాలని సుకుమార్ భావించారు. కానీ అనుకోకుండా కరోనా రావడంతో ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. 

 

ఈ చిత్రానికి  సంబంధించి ఓ టైటిల్ పోస్టర్‌ను కూడా చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఎర్ర చందనంతో పాటు బన్నీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని నేలపై కూర్చోబెట్టి వెనక నిలబడి ఉన్నట్లు భలే ఆలోచించి క్రియేటివిటీ చేశారని అంటున్నారు.  ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయిన్పటికీ ఫేక్ అని తెలియడంతో అవాక్కవుతున్నారు. ఇదిలా ఉంటే బన్నీ తాజాగా నటిస్తున్న పుష్ఫ చిత్రం చిత్తూరు శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల అరాచకాల నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: