మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఖైది నంబర్ 150, సైరా సినిమాల తర్వాత చిరు ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో నటిస్తాడని తెలుస్తుంది. ఈ రీమేక్ డైరక్షన్ ఛాన్స్ ను సాహో డైరక్టర్ సుజిత్ కు ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మారుస్తున్నారట.

 

ఇదిలాఉంటే ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో విజయ్ దేవరకొండని తీసుకోవాలని చూస్తున్నారట మేకర్స్. మళయాళంలో మోహన్ లాల్ తో పాటుగా పృధ్వి రాజ్ కూడా నటించారు. పృధ్వి రాజ్ పాత్రని విజయ్ తో చేయిస్తే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని భావిస్తున్నారట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తికాగానే మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

 

మరి చిరు లూసిఫర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినా విజయ్ దేవరకొండ చేస్తాడా అన్నది కూడా డౌటే అని చెప్పొచ్చు. ఒకవేళ విజయ్సినిమా చేస్తే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. మెగాస్టార్ మీద ఉన్న అభిమానం కోసమైనా విజయ్మూవీ చేస్తే మెగా ఫ్యాన్స్ లో అతని క్రేజ్ డబుల్ అవుతుందని చెప్పొచ్చు. అయితే సోలో హీరోగా మంచి ఫాం లో ఉన్న అతను మరో హీరో సినిమాలో చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఆలోచిస్తున్నాడట.                        

మరింత సమాచారం తెలుసుకోండి: