కరోనా లాక్ డౌన్ సమయంలో..... మన టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్న దగ్గుబాటి రానా, నిఖిల్ అలాగే నితిన్ లు పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాళ్ళు కాగా ఇక అదే బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్న స్టార్ హీరోలు... ప్రభాస్, మెగాహీరో సాయిధరమ్ తేజ్, అక్కినేని వారసుడు అఖిల్... ల పై ఇప్పుడు అందరి చూపు పడింది. ఇటీవలే మెగా ఇంటి వారసుడు... తెలుగింటి అభిమాన తార సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి... ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన తెలిసిందే.. అది ఏంటంటే తేజ్ కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడని.... ఇక ఆయన బ్యాచిలర్ ఎండ్ కార్డు వేసే అమ్మాయి దొరికేసింది అంటూ చాలా వార్తలు వినిపించాయి.

దీనికితోడు తెలుగు ప్రజల ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి సైతం మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా... విషెస్ చేస్తూ అందులో 'డియర్ తేజ్.. 'సోలో'గా ఉన్నప్పుడే ఫుల్ గా ఎంజాయ్ చేసేయ్. నీ 'సోలో' లైఫ్ ఇంకొన్ని రోజులే' అని  పేర్కొన్నాడు. దాంతో ఏకంగా మెగాస్టార్ హింట్ ఇవ్వడంతో త్వరలోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఖాయం అని ఫిక్స్ అయ్యారు అందరు. దీనికి సాయి ధరమ్ తేజ్ స్పందన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో మెరిసిన సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి వార్త గురించి మాట్లాడుతూ ''ఇంట్లో వాళ్లు పెళ్లి చేసెయ్యాలని నిర్ణయించుకున్నది నిజమే.

ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తుంటే సంబంధాలు చూడమని మాత్రం చెప్పాను. కానీ అది ప్రస్తుతానికి అక్కడ వరకు మాత్రమే పరిమితం అయింది. అంతకుమించి నా పెళ్లిపై ఏదీ ముందుకు సాగలేదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి నాకు పెళ్లి పై పెద్దగా ఆసక్తి లేదని..  అలాంటి ఆలోచన లేదని చెప్పాడు. దీంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మరి ఈ హీరోకి సరైన జోడి దొరికి త్వరలోనే పెళ్లి కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: