తెలుగు చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన రవితేజ.. తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.. ఇక రవితేజ యాక్టింగ్ కామెడీ టైమింగ్ చూడటానికే అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ మధ్య వరుస ఫ్లాపులలో ఉన్న మాస్ రాజా.. తాజాగా క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. గతేడాది రవితేజ చేసిన డిస్కోరాజా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కినా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సీరియస్ కథలు ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లకూడదని రవితేజ నిర్ణయించుకున్నాడట.

తాజాగా రవితేజ చేసిన క్రాక్ ఒక కాప్ డ్రామా సినిమా.ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరుగా థియేటర్లలో ఆకట్టుకుంటున్నాడు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుంది.క్రాక్ తర్వాత మాస్ రాజా మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఆయనతో వీర సినిమా తీసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. క్రాక్ సక్సెస్ సందర్బంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ.. తన కెరీర్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టాడు.

'మీ లైఫ్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారు..? ఎంత?' అనే ప్రశ్నకి రవితేజ స్పందించి.. ఫస్ట్ టైం 'నిన్నేపెళ్లాడతా' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాక నాగార్జున సంతకం చేసిన చెక్ చేతికిచ్చారు. ఇక అందులో అమౌంట్ వచ్చేసి మూడువేల ఐదు వందలు. ఆ చెక్కును చాలారోజులు భద్రంగా దాచుకున్నాను. తర్వాత మనీ బాగా అవసరమై చెక్ బ్యాంకులో ఇచ్చేసా..' అంటూ తనదైన స్టైల్ లో ఫన్ టచ్ ఇచ్చాడు..ప్రస్తుతం ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: