హిందీ బిగ్ బాస్ షోలో తన తోటి ఇంటి సభ్యులైన బాని జీ, రోహన్ మెహ్రాలపై మూత్రం చల్లారు. ఇది అప్పట్లో సంచలన వార్తగా నిలిచింది. ఈ వివాదం చివరికి ఆయనను బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లే పరిస్థితికి దారి తీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్ ఖాన్.. అతడిని షో నుంచి వెంటనే బయటకు పంపారు. ఆ తర్వాత కూడా ఈ వివాదం కొద్ది రోజుల పాటు కొనసాగింది. అంతే కాదు ఆయన పై పలు కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. 2008లో స్వామిపై అతడి సోదరుడు ప్రమోద్, తన షాపును స్వామి కూల్చేశాడని కేసు పెట్టాడు. అలాగే 2017లో స్వామి ఓమ్, అతడి స్నేహితుడితో కలిసి ఒక మహిళను వివస్త్రను చేసి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబడింది. ఇలా పలు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
ఇదిలా ఉండగా, 3 నెలల క్రితం స్వామి ఓమ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ తర్వాత కెన్నీ రోజుల తరువాత కరోనా నుండి కోలుకున్నారు కానీ... పలు సైడ్ ఎఫెక్ట్ ల బారిన పడ్డారు. ఈ క్రమంలో గత 15 రోజుల నుండి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కాగా చివరికి మృత్యువుతో పోరాడి గెలవలేక అనంతలోకాలకు చేరిపోయారు. ప్రతి మనిషి ఏదో ఒక విధంగా ఫేమస్ అవుతారు. అది మంచిగా కావొచ్చు లేదా చుడుగా కావొచ్చు. కానీ ఈ స్వామి మాత్రం బ్రతికినంత కాలం వియ్యదల మధ్యనే ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి