ఒకప్పుడు టాలీవుడ్ లో  వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీయ..   రష్యాకు చెందిన ఆండ్రీ కోషీవ్ ని 2018లో వివాహం చేసుకున్నారు.  పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని గడుపుతున్న ఆమె తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. 2000 వ సంవత్సరంలో ఇష్టం సినిమా తో హీరోయిన్ గా పరిచమైన శ్రీయ ఈ ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో కొనసాగుతూ వచ్చింది.. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన టైం లో ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ ప్రేక్షకులు తనని మర్చిపోనీయకుండా చేసుకుంది..  తనదైన టైం లో స్టార్ హీరో లను సైతం వెయిట్ చేయించిన హీరోయిన్ ఆమె..

అందం తో పాటు అభినయం గ్లామర్ కూడా ఆమె సొంతం.. అందుకే ఆమె కు అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.. తన పని అయిపోతుందనుకున్న టైం లో ఎదో ఒక సినిమా తో ఫామ్ లోకి వచ్చి తానేంటో నిరూపించుకునేది. తెలుగులో ప్రస్తుతం కూడా సినిమా చేస్తున్న సీనియర్ హీరోయిన్ శ్రీయనే.. సోషల్ మీడియా లో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు..  ప్రతి అప్ డేట్ ని పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.

అయితే ఈమధ్య ఆ పోస్ట్ లు శృతి మించుతున్నాయి. శ్రియా శరణ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలను చూసి నెటిజెన్స్ తిట్టుకుంటున్నారు. పబ్లిక్ లో ఆమె అసభ్యకరమైన ఫోజులలో రొమాన్స్ చేయడమే దీనికి కారణం. శ్రియా లేటెస్ట్ ఫోటోలు ఒకింత వల్గర్ గా అనిపించాయి.  ఈ మధ్యే ఈమె భర్త తో కలిసి వరల్డ్ టూర్ కి వెళ్లారు.పెరూ దేశంలోని వరల్డ్ వండర్స్ లో ఒకటైన మాచు పీచు ప్రదేశాన్ని వీరు సందర్శించారు.  టూర్ లో భాగంగా అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శిచడం జరిగింది.కాగా అక్కడ సముద్ర తీరాన శ్రియా హాట్ హాట్ యాంగిల్స్ లో భర్తతో పోటోలకు పోజిచ్చారు.  పబ్లిక్ ఏరియాలో భర్తతో శ్రియా దిగిన ఫోటోలు చర్చకు దారి తీశాయి. ఆండ్రీతో ఆమె ఫోజుతో పాటు వేసుకున్న డ్రెస్ కూడా అసభ్యకరంగా ఉన్నాయి.దీనితో ఎంత భర్త అయితే మాత్రం అవేమి పోజులంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బ్యూటిఫుల్, రొమాంటిక్ కపుల్ అంటూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: