ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తోంది. ఒక దశ కరోనా వైరస్ తగ్గింది అనుకునే లోపే మరో దశ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. భారత్ కూడా సంసిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగిస్తోంది. ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించేందుకు ప్రకటన కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం  ఇక అందరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.  ఈ క్రమంలోనే కరోనా వైరస్ థర్డ్ వేవ్ వచ్చే లోపే వ్యాక్సిన్ వేసుకునేందుకు అందరూ ముందుకు వస్తున్నారు.



 ఇక సామాన్యుల అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. కాని సినీ సెలబ్రిటీలు మాత్రం ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావడం లేదు. కొంతమంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్లు అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకున్న దాఖలాలు లేవు.  ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు వ్యాక్సిన్ వేసుకుంటూ ఇక తమ అభిమానులను కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని చెప్పారు.  సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఏదైనా చెప్పారు అంటే ఇక వారికి ఉండే కోట్లాది మంది అభిమానులు వారి చెప్పింది తప్పకుండా చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లు మాత్రం వ్యాక్సిన్ వేసుకోవడమే కాదు.. వ్యాక్సిన్ వేసుకోవద్దు అని అభిమానులకు సంకేతాలు ఇస్తున్నట్లు ఉంది పరిస్థితి.


 దీంతో రోజురోజుకు అటు టాలీవుడ్ హీరోయిన్ల పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు కొంత మంది నెటిజన్లు కాస్త ఘాటుగా కూడా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో.  ఎక్కడపడితే అక్కడ టాటూలు వేయించుకుంటారు. ఎంత నొప్పి వచ్చినా భరిస్తారు కానీ ఇంజక్షన్ అంటే మాత్రం హీరోయిన్లకు భయం పట్టుకున్నట్టు ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. టాటూలు వేయించుకున్నప్పుడు లేని నొప్పి ఇంజెక్షన్లు వేయించుకుంటే ఏం వస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.  మీరు అందరికంటే ముందుగా వ్యాక్సిన్ వేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ మీరేమో వ్యాక్సిన్ కి దూరంగా ఉంటూ మీ అభిమానులకు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అంటూ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ లని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: