తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే త‌న‌కంటూ ఒక సువ‌ర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న న‌టీ సావిత్రి.  లెజెండ‌ర్ యాక్ట‌ర్ సావిత్రి బ‌యోఫిక్ ఆధారంగా చిత్రిక‌రించిన సినిమా మ‌హాన‌టి. ఆమె జీవితం మొత్తం ఒక తెర‌చిన పుస్త‌కం. ఆమె జీవితంలో దాదాపు 75 శాతం వ‌ర‌కు న‌టీగానే కొన‌సాగింది. మిగిలిన 25 శాతం జీవిత ప‌రిణామాల‌పై ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు వినిపించాయి. అలాంటి గొప్ప న‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా మ‌హాన‌టి. కీర్తి సురేష్ ప్ర‌ధాన‌పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలినిపాండే, నాగ‌చైత‌న్య వంటి న‌టులు కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని చాలా అధ్బుతంగా  చిత్రీక‌రించాడు. సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఓ యువ ద‌ర్శ‌కుడు సినిమా చేస్తున్నాడ‌ని అంద‌రూ పెద‌వి విరిచారు. అత‌నికి ఏమి తెలియ‌ద‌ని, ఏమి అర్హ‌త లేద‌ని ఎవ‌రికీ తోచిన‌ట్టు వారు కామెంట్లు చేశారు.

ఎవ‌రు ఏమి అన్నా అవేమి ప‌ట్టించుకోకుండా ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన విష‌యాల‌ను ఎంతో ఆస‌క్తి క‌రంగా చిత్రీక‌రించాడు నాగ్ అశ్విన్‌. సావిత్రి సినిమాల్లోకి ఎలా వ‌చ్చారని, సినిమాల్లోకి రావ‌డానికి ప్రేరేపించే అంశాలు, సినిమాల్లోకి వ‌చ్చిన త‌రువాత ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు అనేదే సావిత్రి సినిమా. బంగారం లాంటి త‌న జీవితంలో మ‌ద్యానికి ఎందుకు బానిస కావాల్సి వ‌చ్చింది. ఆమె జీవితంలో చోటు చేసుకున్న మంచి, చెడు రెండు సంఘ‌ట‌న‌లు చాలా అద్భుతం. మ‌హాన‌టి చివ‌రిరోజుల్లో ప‌డే బాధ‌ను చూసి ప్ర‌తి ప్రేక్ష‌కుడు చ‌లించిపోతాడు. ప్రేమించిన వ్య‌క్తిని త‌న ప్రేమ కోసం దూరం చేసుకున్న విష‌యంలో ఆమె వ్య‌క్తిత్వం చాలా బ‌ల‌మైన‌ది. ఎవ‌రైనా నీ వ‌ల్ల కాదు అని అంటే ఆమె మొండి ప‌ట్టుద‌ల‌తో త‌న వ‌ల్ల ఎందుకు కాద‌ని చేసి చూపిస్తుంది సావిత్రి.

ఇప్ప‌టివ‌ర‌కు సినీ ఇండ‌స్ట్రీలో సావిత్రి లాంటి  గొప్ప న‌టీని మ‌నం చూడ‌లేమేమో అనిపిస్తుంది. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ఎంతో ఒదిగిపోయారు. అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. సావిత్రి గారిని నిజంగానే తెర‌మీద చూస్తున్నామా అనుకునేంత‌గా సావిత్రి పాత్ర‌లో ఒదిగిపోయారు  కీర్తి సురేష్‌. ఆమె కాస్టూమ్స్, మేక‌ప్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఆమె త‌ప్ప మ‌రెవ్వ‌రూ ఈ సావిత్రి పాత్ర‌కు న్యాయం చేయ‌లేరేమోన‌ని అనుకునేంత‌గా అద్భ‌తంగా న‌టించింది. కేవ‌లం హీరోల‌కే  ఎక్కువ ప్రాధ‌న్య‌త క‌లిగిన  నేటి సినిమారంగంలో  ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి కీర్తి సురేష్ దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రితో పాటు మ‌ధుర‌వాణి అనే జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో స‌మంత కూడా అద్భుతంగా న‌టించింది. మ‌రో నటి షాలినిపాండే త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింది.  భావిత‌రాల‌ను నిర్మించే స్త్రీ జాతి కోసం త‌ర‌త‌రాలు గ‌ర్వించే సావిత్రి క‌థ మ‌హాన‌టి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు నాగ్అశ్విన్ ను అభినందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: