విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుంది తెలిసిందే. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా వెండితెరకు దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి. ఈ సినిమా టాలీవుడ్ లోనే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రాకముందు సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ 'శివ' సినిమా కంటే ముందు.. తర్వాత అనే రేంజ్ గా మారిపోయింది. మళ్లీ చాలా కాలం తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు సినిమా గతిని మార్చాడు సందీప్ రెడ్డి. ఒక ఫార్ములాలో వెళ్తున్న తెలుగు సినిమా కథలను అర్జున్ రెడ్డి బ్రేక్ చేసి చూపించింది.

 డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా కి యూత్ ఆడియెన్స్ ను విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఇక సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి మూవీ తో విజయ్ దేవరకొండ ఏకంగా ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంత పెద్ద స్టార్ అవడానికి ఒక రకంగా సందీప్ రెడ్డి కారణమని చెప్పాలి. ఇక దర్శకుడిగా మొదటి సినిమాతోనే స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు సందీప్ రెడ్డి. నిజానికి అర్జున్ రెడ్డి కథను చాలామంది స్టార్ హీరోలకు వినిపించాడు. కానీ ఎందుకో అది కుదరలేదు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలు సందీప్ రెడ్డి డైరెక్షన్ ని మెచ్చుకోవడమే కాకుండా అతనితో సినిమా చేయడానికి కూడా సిద్ధమయ్యారు.

ఆ మధ్య మహేష్ బాబు కి సందీప్ రెడ్డి ఒక్క కూడా కనిపించాడు. అంతేకాదు అల్లు అర్జున్ కూడా సందీప్ తో సినిమా చేయాలని ఆసక్తి చూపించాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో తమిళ్ లో కూడా రీమేక్ చేశారు. రెండు చోట్లా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కి గా షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. ఇక హిందీ రీమేక్ ని కూడా సందీప్ రెడ్డి డైరెక్ట్ చేయడం విశేషం. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్లో రణబీర్ కపూర్ తో 'యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఇటీవల హీరో ప్రభాస్ తో మరో ప్రాజెక్టును కూడా ఓకే చేయించుకున్నాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు సందీప్ రెడ్డి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: