ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో మరో సూపర్ హిట్ ను అకౌంట్ లో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మొదట్లో నెగిటివ్ టాక్ తో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ చిత్రం ఆ తరవాత ఊపందుకున్న సక్సెస్ రేట్ ను పెంచుకుంది. మహి లాంటి స్టార్ హీరోకి తగ్గ బజ్ ను కలెక్షన్స్ లో క్రియేట్ చేసింది. అయితే ఇపుడు మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గురించి వినిపిస్తున్న ఒక వార్త మహి అభిమానులను కలవర పెడుతోంది. స్క్రిప్ట్ కానీ తనకు తగ్గట్టుగా ఎంచుకోవడంలో, సమాజానికి ఉపయోగపడేలా చూసుకోవడంలో, అభిమానుల మనసుకు దగ్గరగా ఉండేలా చూసుకోవడంలో మహి ఎపుడు ముందుంటారు. ఈ హీరో ఓ దర్శకుడికి ఓకే చెప్పరు అంటే ఎంతో ఆలోచించి గానీ సరే అనరు అని ఒక నమ్మకం. లైన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటే తప్ప మహి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు అని నమ్మకం.

అయితే ఇపుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాపై మహి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో లైన్ విని ఒకే చేసిన మహి ఇపుడు సెకండ్ ఆఫ్ అంతగా బాగోలేదు అంటున్నారట. ఫస్ట్ ఆఫ్ చాలా నచ్చింది కానీ సెకండ్ ఆఫ్ లో చేంజెస్ అవసరం కొంచం మార్చండి అని దర్శకుడు త్రివిక్రమ్ కి చెప్పారట మహేష్ బాబు. మన కాంబో అంటే అతడు వంటి పక్కా బ్లాక్ బస్టర్ ఎక్ష్పెక్ట్ చేస్తారు జనాలు అలాంటిది సినిమాలో ఏ కొంచం అపశృతి జరిగినా అభిమానుల్ని నిరాశ పరిచినట్లు అవుతుంది. సో లేట్ అయినా పర్వాలేదు ఫుల్ పర్ఫెక్ట్ గా ఉండేలా కొంచం చూసుకోండి అని చెప్పేశాడట మహి. కాబట్టి త్రివిక్రమ్  మహేష్ బాబు కాంబో లో తెరకెక్కనున్న ఈ చిత్రం మరికాస్త లేట్ అయ్యేలా ఉంది.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ దర్శకుడు త్రివిక్రమ్  కాంబినేషన్ లో మూవీ చేస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే మరోసారి మహి తో స్టెప్పులేయనుంది.  ఇండస్ట్రీలో మహేష్ బాబు కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పర్ఫెక్షన్ కి కేరాఫ్ అడ్రెస్స్ అంటే దాదాపు అంతా మహేష్ కే ఓటేస్తారు. ఎందుకు ఏమిటన్న విషయం తెలియదు కానీ మహి ఫ్యాన్స్ చాలా స్పెషల్. ఎందుకంటే ప్రతి స్టార్ హీరోకి సెపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అలాగే మహి కి కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.  అయితే ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా మహి ఫ్యాన్స్ లిస్ట్ లో భారీగా ఉండటం విశేషం. అలా అందరికీ నచ్చే హీరో మహి. అంతగా ఈయన సినిమాలు ప్రేక్షకులపై ప్రభావం చూపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: