మాచో స్టార్ గోపీచంద్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల `సీటీమార్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.ఇదిలావుండగా  ప్రస్తుతం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ `పక్కా కమర్షియల్‌` లో నటించిన సంగతి తెలిసిందే.ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ రాశీ ఖన్నా  పలు కీలక పాత్రల్లో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించారు. అయితే జూలై 1న రిలీజ్ కానున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కుతుంది.

ఇదిలావుంటే చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.అయితే  ఇప్పటికే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక  ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల శిల్పా కళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఇకపోతే ఈ పక్కా కమర్షియల్ మెగా మ్యాచో ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరై చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అయితే మరింత రీచ్ పెరిగేలా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది యూనిట్.అంతేకాదు తాజాగా పక్కా కమర్షియల్ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

పోతే  ఈ చిత్రం 2 గంటల 32 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించడానికి అన్ని విధాలా సిద్ధమైంది.ఇక  ఇప్పటికే చిత్రంలోని పాటలు, ట్రైలర్ ఆడియెన్స్ కు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఇదిలావుండగా అటు మరోవైపు టైటిల్ కు కూడా ఇండస్ట్రీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇక చాలా కాలంగా ఓ భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కి ఈ పక్కా కమర్షియల్ మూవీ ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి.ఈ సినిమా తర్వాత తనకు లక్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు గోపిచంద్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి కథానాయకగా నటిస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: