ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే పెద్ద ఎత్తున పారితోషకం ఇచ్చి... పెద్ద  సెలెబ్రిటీలను ఎంపిక చేసుకొని వారి చేత తమ బ్రాండ్లకు ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు.ఇకపోతే లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ మాత్రం తన జువెలర్స్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఇక ఈయన తన జువెలరీ షాప్ కోసం చేసుకున్న యాడ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే డబ్బులు ఊరికే రావు అంటూ ఈయన చెప్పిన డైలాగ్ అందరిలోనూ ఎంతో నమ్మకాన్ని పెంచిందని చెప్పాలి.కాగా బంగారం కొనే ముందు ధరలు చెక్ చేసుకోండి అంటూ కిరణ్ కుమార్ 

తమ బంగారు నగల పట్ల నమ్మకాన్ని పెంచడంతో ఈయన లలిత జ్యువెలర్స్ షాప్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు. అయితే ఇక  ఇలా లలిత జ్యువెలర్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన కిరణ్ కుమార్ కూడా ఒక సినిమాలో నటించారనే విషయం చాలా మందికి తెలియదు.ఇదిలావుంటే  ఈయన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లింగా. కాగా ఈ సినిమాలో కిరణ్ కుమార్ సందడి చేశారు.అయితే ఈ సినిమాలో ఈయన జువెలరీ యజమానిగా నటించిన సందడి చేశారు.

పోతే ఈ సినిమాతో కెమెరా ముందుకు మొదటిసారి వచ్చిన కిరణ్ కుమార్ అనంతరం తన జువెలరీ షాప్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ యాడ్ చేశారు. ఇక ఈయన మొదటిసారి యాడ్ షూట్ చేయడం కోసం మూడు రోజుల సమయం పాటు తీసుకున్నారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇకపోతే లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ అంటేనే మనకు ఆయన గుండె కళ్ళ ముందు కనపడుతుంది. కాగా  తన గుండు తనకు ఎంతో అదృష్టాన్ని తీసుకువచ్చిందని అందుకే తనని ఎవరైనా గుండు అని పిలిచిన తాను బాధపడనని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ వెల్లడించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: