నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . బాలకృష్ణ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్ప టికి కూడా మోస్ట్ క్రేజీ హీరో గా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం బాలకృష్ణ 'అఖండ' మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు . ప్రస్తుతం బాలకృష్ణ  పోయిన సంవత్సరం క్రాక్ మూవీ తో మంచి  విజయాన్ని అందుకుని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు .

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుం డగా  తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు . దునియా విజయ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తుండగా , వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా , ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగం కి పైగా పూర్తి అయ్యింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల అనగా ఆగస్ట్ 25 వ తేదీన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ కోసం టర్కీ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టర్కీ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని కీలక సభ్యుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: