అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ కీలక పాత్రలలో  కొంత కాలం క్రితం గీతాంజలి అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో అంజలి తన అద్భుతమైన నటనతో ఈ సినిమా విజయంలో అత్యంత ప్రముఖ పాత్రను పోషించింది. 

ఇది ఇలా ఉంటే గీతాంజలి మూవీ సూపర్ సక్సెస్ అయ్యి భారీ కలక్షన్ లను రాబట్టడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో ఓ మూవీ ని రూపొందించారు. ఇందులో అంజలి ప్రధాన పాత్రలో నటించగా ... శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , సునీల్ , సత్య , అలీ , షకలక శంకర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాను ఏప్రిల్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మివేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా థియేటర్ హక్కులను అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.  ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: