చిరంజీవి ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. చిరంజీవి తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. ఇక చిరంజీవి సిరి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు. సినిమాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి చిరంజీవికి ఫుల్ సపోర్ట్ గా నిలుస్తారు.


ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి సినిమా తీయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చాలా బాగుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెట్స్ పైనకు వెళ్లనుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేసుకుని అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నారట. చిరంజీవికి డేట్స్ కుదరకపోవడం వలన సినిమా షూటింగ్ వాయిదా వేస్తున్నారట.


ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా.... ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్లుగా ఇద్దరినీ సెలెక్ట్ చేశారట. ఐశ్వర్య రాజేష్, సీనియర్ నటి త్రిషను ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుకుంటున్నారట. ఇప్పటికే నటి త్రిషకు సినిమా కథను వినిపించగా.... ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది.

ఐశ్వర్య రాజేష్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి నటించడానికి ఓకే చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను కూడా పెట్టాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట. స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ను సెలెక్ట్ చేసే పనిలో అనిల్ రావిపూడి ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. కాగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: