
మహేష్ బాబు ఈ రోజున ఈడి విచారణకు హాజరు కావాల్సి ఉండగా సూర్య డెవలపర్ కేసులో విచారణ కొనసాగుతూ ఉన్నది. గతంలో షూటింగ్ వల్ల రాలేకపోయినా మహేష్ బాబు మెయిల్ ద్వారా ఈడి అధికారులకు సమాచారాన్ని కూడా అందించారు. అయితే అనుకున్న తేదీకి రాకపోతే మరొక తేదీకి ఈడీ అధికారులు సూచించారు.. అయితే ఈ రోజున మహేష్ బాబు విచారణకు హాజరు అవుతారా లేకపోతే ఎలా అన్నది అభిమానుల ఆందోళన కలిగిస్తున్న విషయం.
సూర్య డెవలపర్ ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు 5.90 కోట్లు రూపాయలు తీసుకున్నారని అయితే ఇందులో 3.4 కోట్ల రూపాయలు నగదు కాగా..2.5 కోట్ల రూపాయలు RTGS ద్వారా తీసుకున్నట్లుగా తెలియజేశారు ఈ కేసులో విచారణకు రావాలి అంటే నోటీసులను పంపించారు మరి ఈ కేసు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో SSMB 29 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఇలాంటి సమయంలోనే ఇలా ఈడి విచారణకు పిలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఈ కేసు విషయంలో మహేష్ బాబు ఏ విధంగా బయటపడతారో చూడాలి.