డబ్బున్న వాళ్ళు పెద్దోళ్ళు అలానే కలుస్తూ ఉంటారు .. కలిసి కూర్చుంటారు అవసరమైతే కలిసి భోజనాలు కూడా ఒకే కంచంలో తింటారు .. అయితే ఇందులో పెద్ద విచిత్రం ఏముంటుందని అనుకోవద్దు .. తెలంగాణ  రేవంత్ గవర్నమెంట్‌కు నాగార్జునకు మధ్య జరుగుతున్న వార్‌ గురించి అందరికీ తెలిసిందే .. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు పెద్ద ఇష్యులు ఉన్నాయి .. వీటిలో మొదటిది ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ..  రేవంత్‌ హయాంలోని నాగార్జునకు రెండో అతిపెద్ద వ్యాపారంగా ఉండే మొదటి అన్నపూర్ణ స్టూడియోస్ ఆ తర్వాత చెప్పుకునే ఎన్‌ కన్వెన్షన్ ను కూల్చివేసింది రేవంత్ హైడ్రా .. ఇక దీనిపై నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్నారు .. కోర్టు స్టే ఇచ్చింది కానీ కూల్చివేసింది అలానే ఉంది ఇప్పటికీ అటువైపు వెళ్తుంటే ఆ శ‌క‌లాలు దర్శనమిస్తూ ఉంటాయి .. కాబట్టి గాయం ఇంకా పచ్చగానే ఉన్నట్టు లెక్క .


ఇక్కడ ఎన్‌ కన్వెన్షన్ డబ్బుకు సంబంధించిన విషయం .. ఇక మరో కొట్టి పరువుకు సంబంధించిన ఇష్యూ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఓ మహిళా మంత్రి నాగార్జున పై అత్యంత జుబ్క్ష కరమైన వ్యాఖ్యలు చేసింది .  ఓ మహిళ అయ్యుండి అలా మాట్లాడటం సరికాదు చాలామంది ఆ సమయంలో అలా అభిప్రాయపడ్డారు కూడా దీనిపై కూడా నాగార్జున న్యాయ పోరాటానికి దిగారు .  తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ పరువు నష్టం దావా కూడా వేశారు .. ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో నాగార్జునకు రెండు పెద్ద తగాదాలు నడుస్తున్నాయి ..

 

అయినప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కనపెట్టి తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నాడు నాగార్జున .. తాజాగా మిస్ వ‌ర‌ల్డ్‌ 2025 పోటీల్లో భాగంగా తెలంగాణ బ్యూటీ అండ్ కల్చర్ను సెలబ్రేట్ చేసుకునే వేడుకలలో ఓకే టేబుల్ పై రేవంత్ , నాగార్జున కలిసి కనిపించారు .  ఇక నిజానికి వీరిద్దరూ ఇలా కలవడం ఇదే మొదటిసారి కాదు .  గతంలో టాలీవుడ్ పెద్దలు కొంతమంది వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో కూడా నాగార్జున ఉన్నారు .. ఆ సమయంలో నాగార్జున , రేవంత్ కు సాలువా కూడా  కప్పారు .. ఈసారి ఓకే టేబుల్ షేర్ చేసుకున్నారు .. అందుకే ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా నాగార్జున , సీఎం రేవంత్ రెడ్డి జోడి ఎక్కువ మందిని ఎంతగానో ఆకర్షిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: