ఇక ఈ సంవత్సరం సమ్మర్ అంతా ఆశాజనకంగా కనిపించడం లేదు .  మరీ ముఖ్యంగా మే నెల ఎంతో చప్పగా నడుస్తుంది .   భారీ అంచనాల మధ్య వచ్చిన హిట్ 3 మోస్ట్ వైలంట్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి తర్వాత సోమవారం నుంచి స్లో అయింది .. ఫైనల్ రన్ లో ఆంధ్రాలోని కొన్ని ఏరియాలో నష్టాలు తప్పవు .. ఇక శ్రీ విష్ణు సింగల్ డిస్టిబ్యూటర్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చింది .. ఆ తర్వాత ఈ నెలలో అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు .  


అయితే ఈ క్రమంలోనే రీ రిలీజ్ సినిమాలు మాత్రం గట్టిగా క్యూ కట్టాయి .. ఏకంగా నలుగురు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి .  వాటిలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మే 16న రిలీజ్ కు రాబోతుంది .  ఇలా రెండు రోజుల గ్యాప్ లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది .. మైత్రి మూవీస్ ఈ సినిమాలను నైజాంలో రీ రిలీజ్ చేస్తుంది .  ఇక అలా వారం గ్యాప్ లోనే రెబల్ స్టార్ కెరియర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్ వర్షం మే 23న  థియేటర్లో సందడి చేయనుంది  ..



అలాగే  ఈ నెలాఖరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా మే 30న రిలీజ్ కు రాబోతుంది .. అలాగే మే 31న మహేష్ మరో సినిమా అతిధి కూడా రీ రిలీజ్ అవుతుంది .  ఇలా ఈ నెలలో చెప్పుకో ద‌గ్గ‌ సినిమాలు లేకపోవటంతో రీ రిలీజ్ సినిమాలకు మంచి దారి దొరికింది .. అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ సినిమాలు అంతగా కలెక్షన్స్ అందుకోవటం లేదు .. అయితే ఇప్పుడు ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ రాబడతాయో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: