సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసింది .. దాదాపు రెండు దశాబ్దలుగా చిత్ర పరిశ్రమను ఏలుతుంది .. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయినా ఈ ముద్దుగుమ్మ .. పొన్నియన్ సెల్వన్ సినిమా తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చింది .. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో త్రిషకు వరుస అవకాశాలు వచ్చాయి .. ముఖ్యంగా కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది ఈ మధ్యగమ్మ .. ఇప్పటికే  దళపతి విజ‌య్ , అజిత్ కు జంటగా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది .. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో మెప్పించిన త్రిష .. తాజాగా కమలహాసన్ థగ్ లైఫ్ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది ..


అయితే 42 సంవత్సరాల వయసులో ఏమాత్రం తరగని అందంతో  అందరి మతులు పోగుడుతుంది .. ఈ క్రమంలో తాజాగా త్రిషకు  సంబంధించిన ఒక వార్త ఫిలిం వర్గాల్లో వైరల్ గా మారింది . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చెన్నైకి చెందిన  పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా (PFCI) అనే ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి గజా అనే యాంత్రిక ఏనుగును బహుమతిగా అందించింది త్రిష .. అలాగే దీనిని సాంప్రదాయ మంగళ వాయిద్యాల మధ్య ఆలయానికి అందజేసినట్లు  పీఎఫ్సీఐ నిర్వాహకులు తెలిపారు .. అలాగే ఆలయ వేడుకల కోసం ఈ యాంత్రిక ఏనుగును బహుకరించడం తమిళనాడులో ఇది తొలిసారి కావటం విశేషం .. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో త్రిష పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..



మరింత సమాచారం తెలుసుకోండి: