
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది . సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కన్నా హృతిక్ రోషన్ మాట్లాడిన మాటల కన్నా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు స్పీచ్ హైలెట్గా మారింది . ఇప్పుడు అందరూ ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నారు . త్రివిక్రమ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.." దేవర విడుదలైనప్పుడు ఆ ఏడాది దేవరనామ సంవత్సర అని చెప్పాను.. ఇది హృతిక్ రామారావు నామ సంవత్సరం అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు" .
"మెరుపు తీగలా ఉన్న ఇద్దరినీ ఒకే తెరపై చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటూ కోరుకుంటున్నాను. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు అంతకుమించిన లెవెల్ లో ఉంటుంది . దర్శకుడు అయాన్ నాకు అదే చెప్పారు. అయాన్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది . ఇది సాధారణ యాక్షన్ మూవీ అయితే కానేకాదు . సాధారణ యాక్షన్ మూవీకి ఎన్టీఆర్ అవసరం లేదు. ఎన్టీఆర్ ని ఏరి కోరి చూస్ చేసుకున్నారు అంటే ఇది అంతకు మించిన ప్రాజెక్ట్. ఏ భావోద్వేగానైనా పలికించగలనటుడు ఎన్టీఆర్" అంటూ త్రివిక్రమ్ మాట్లాడారు.
త్రివిక్రమ్ ఇంకా మాట్లాడుతూ.." అందరికీ తెలిసిందే బంగారం ఉంటే నగ చేయించుకుంటారు కానీ బీరువాలో పెట్టుకోరు కదా.. ఎన్టీఆర్ కూడా అలాంటివాడే బంగారం లాంటి వారు.. ఏ నగ చేయించాలో అయాన్ కి బాగా తెలుసు . అందుకే ఎన్టీఆర్ కోసం ఇక్కడిదాకా వచ్చారు . ఎన్టీఆర్ - హృతిక్ ల వింధ్య - హిమాలయాల పర్వతాలు లాంటి వారు " అంటూ పొగిడేశారు . ఈసారి వినాయక చవితి సంబరాలలో వార్ 2 పాట వినపడుతూనే ఉంటుంది అని .. ఆగస్టు 14న విడుదలయ్యే వార్ 2 అందరిని అలరిస్తుంది అని అందరూ ఈ మూమెంట్ ని తప్పక చూడాలి అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!