 
                                
                                
                                
                            
                        
                        రాజమౌళి మాత్రం సినిమా మీద విశ్వాసంతో ముందుకు సాగాడు. షూటింగ్ కొనసాగుతుండగా సినిమా రెండు భాగాలుగా మార్చారు. దాంతో బడ్జెట్ కూడా రెట్టింపు అయి సుమారు రూ.250 కోట్ల దాకా పెరిగింది. సినిమా రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి ప్రీమియర్స్ షోలు వేశారు. కానీ మొదటి షో తర్వాత సోషల్ మీడియాలో డివైడ్ టాక్ రావడంతో రాజమౌళి టీమ్ అంతా తీవ్ర టెన్షన్కు గురయ్యారట. అప్పుడు సినీ సర్కిల్స్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లోనే నెగటివ్ టాక్ వచ్చిందట తొలిరోజు. దీంతో రాజమౌళి పడిన బాధ అంతా ఇంతా కాదట. ముఖ్యంగా ప్రభాస్, రానా, నిర్మాత శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్లకు ఆందోళన ఎక్కువగా కనిపించిందట. రాజమౌళి చెప్పినట్టు, ఆ సమయానికి నిర్మాతలు సుమారు రూ.40 కోట్ల డెఫిషిట్లో ఉన్నారు. “ మనం తీసింది చెడ్డ సినిమా కాదు , ఆడియెన్స్కి నచ్చుతుందనే నమ్మకం ఉంది ” అని రాజమౌళి అప్పటి భావోద్వేగాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు.
తర్వాత డిస్ట్రిబ్యూటర్ కొర్రపాటి సాయిని కలిసి పరిస్థితి తెలుసుకున్నారు. మొదట కాస్త ఆందోళన ఉన్నా, రెండవ రోజు నుంచే కలెక్షన్లు ఊహించని స్థాయికి చేరాయి. ప్రతీ షోకు హౌస్ఫుల్, ప్రతి థియేటర్లో “జై బాహుబలి” నినాదాలు వినిపించాయి. మొదటి వారం తర్వాతే సినిమా బ్రేక్ ఈవెన్ చేరి రికార్డులు బద్దలుకొట్టడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ ఫెనామినన్ సృష్టించింది. ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ రీ–రిలీజ్ సందర్భంగా రాజమౌళి, ప్రభాస్, రానాలు ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ కష్టకాలం, ఆ భయం, ఆ నమ్మకం ఇవన్నీ బాహుబలిని ప్రపంచ వ్యాప్తంగా నిలిపాయి.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి