వ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే సోకిన  ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం స్వదేశీయులను  కూడా వదలడంలేదు. రోజురోజుకు విజృంభిస్తు విలయతాండవం చేస్తుంది ఈ ప్రాణాంతకమైన మహమ్మారి. దేశం మొత్తం ప్రాణభయంతో బతికేలా చేస్తోంది. కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అప్రమత్తం అయిపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... కీలక నిర్ణయాలు కఠిన నిబంధనలు అమలు లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్  కొనసాగుతుంది దేశంలో. 

 

 

 అయితే లాక్ డౌన్ సమయంలో అందరు సెలబ్రిటీలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు కూడా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు లాక్ డౌన్ సమయంలో హాయిగా ఇంట్లో గడిపేందుకు సమయం దొరకడం తో.. వంటావార్పు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. లాక్ డౌన్  సమయం వంటావార్పు నేర్చుకోవడానికి ఉపయోగపడింది అంటూ చెబుతున్నారు. అయితే సెలబ్రిటీలు ఇలా వంటావార్పు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

 

 సోషల్ మీడియా వేదికగా వంట వార్పు ల వీడియోలు, రుచుల  వీడియోలు పోస్టింగ్ చేయడం పూర్తయిందా లేదా అంటూ ఘాటుగా స్పందించింది సానియా మీర్జా. ఒక్కసారి ఆలోచించండి.. ప్రాణాంతకమైన మహామారి కరోనా  వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనం లో వేల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు . లక్షలాది మంది ఒక్క పూట  తిండి  దొరకడమే  అదృష్టం గ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో వంట వార్పు  వీడియోలు షేర్ చేయడం ఏమిటి అంటూ అసహనం వ్యక్తం చేసింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.

మరింత సమాచారం తెలుసుకోండి: