క‌రోనా వైరస్ క‌ట్ట‌డిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మ‌రో కీల‌క అడుగు ముందికి వేశారు. అయితే ప్రస్తుతానికి ఇప్ప‌టికే జగన్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్ర‌భుత్వ‌ం చేయ‌ని విధంగా వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌తో క‌రోనా క‌ట్ట‌డికి తీవ్ర‌స్థాయిలో అలుపెరగని స్థాయిలో కృషి చేస్తున్నారు. వాలంటీర్ల‌ను గ్రామ‌, మండ‌ల‌, న‌గర స్థాయిలో ప్రతి గడపకి పంపి.. ఎవ‌రైనా అనారోగ్యంతో ఉన్నారా ..? అనే విష‌యాన్ని పూర్తిగా ఆరా తీస్తున్నారు. దీనితో దేశ‌వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో జ‌గ‌న్ వ్యూహం మంచి ఫలితమే వచ్చిందని చెప్పవచ్చు. 

 

 


వాలంటీర్ వ్య‌వ‌స్థ కార‌ణంగా.. రాష్ట్ర మొత్తం కేసుల సంఖ్య‌ను ముందుగానే గుర్తించి, రోగుల‌ను క్వారంటైన్ కు పంపడంలోనూ ప్ర‌భుత్వం సక్సెస్ సాధించింది. ఇక‌పోతే, ఇప్పుడు రాష్ట్రంలో ప‌రిస్థితి తీవ్ర‌త రోజురోజుకి పెరుగుతున్న దృష్ట్యా జ‌గ‌న్ మ‌రో ముంద‌డుగు వేశారు. అదేమిటంటే, ప్ర‌స్తుతం క‌రోనా టెస్టింగ్ కేంద్రాలు రాష్ట్రంలో కేవలం 3 మాత్ర‌మే ఉన్నాయి. అవి తిరుప‌తి, కాకినాడ‌, విజ‌య‌వాడ‌ల్లోనే ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే ఇక్క‌డ కూడా రోజుకు 2000 మందికి మించి ప‌రీక్ష‌లు సాగట్లేదు. దీనితో రోగులు ఆసుప‌త్రుల్లో చేరి వారం ప‌దిరోజులకు కానీ రిపోర్టులు అందడం లేదు. 

 

 


దీనితోపాటు ఇక్క‌డ ఏదైనా స‌మ‌స్య కానీ వస్తే.. ఈ న‌మూనాల‌ను పుణేకు పంపి అక్క‌డ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఫ‌లితంగా స‌మ‌యం కాస్త లేట్ అవుతుంది. దీని వల్లే నిజానికి విజ‌య‌వాడ‌లో ఒక మ‌ర‌ణం కూడా న‌మోదైంది. ఆయన ఫలితాల రిపోర్టులు వ‌చ్చే సరికే రోగి మృతి చెందారు. ఈ దశలో కేంద్రం కూడా రాష్ట్రాల‌పై బాగా ఒత్తిడి పెంచింది. రాష్ట్రాలలో క‌రోనా టెస్టింగ్ కేంద్రాల‌ను పెంచాల‌ని ఆయా సీఎం లకి సూచించింది. కాకపోతే, ఈ సూచ‌న‌లు పాటించేందుకు మిగిలిన రాష్ట్రాలు ఆర్ధిక స‌మ‌స్య‌లను అభ్యన్తరం చేసాయి. అయితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్ని ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ కూడా రోగుల‌కు నిర్ధార‌ణ చేసే టెస్టుల‌ను మరి కాస్త వేగం చేసేందుకు జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాకో ఒక టెస్టింగ్ ల్యాబ్‌ ను ఏర్పాటు చేస్తున్నామని తాజాగా ఆయ‌న ఆదేశించారు. దీనితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వైద్య క‌ళాశాల‌ల‌ను ఎస్మా చ‌ట్టం ప‌రిధిలోకి తీసుకొచ్చారు. దీని ఫ‌లితంగా అన్ని ఆసుప‌త్రులు క‌రోనా రోగుల‌ను ప‌రీక్షించి, అడ్మిట్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వచ్చింది. 

 

 

 

ఇక‌పోతే, రిటైర్డ్ అయిన వైద్యులను కూడా ప్ర‌భుత్వం ఇంకోసారి కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న నియ‌మించుకునేందుకు కూడా జగన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఢిల్లీలో జ‌రిగిన మ‌ర్క‌జ్‌ తో సంబంధాలు ఉన్న వారిని యుద్ధ ప్రాతిప‌దిక‌న గుర్తించి వారిని క‌రోనా టెస్టులు చేపియాలన్న జ‌గ‌న్ వ్యూహం ఫ‌లిస్తే మాత్రం అతి త్వ‌ర‌లోనే ఆంధ్రప్రదేశ్ లో క‌రోనా విజృంభ‌ణ‌కు కచ్చితంగా బ్రేక్ ప‌డుతుంద‌ని అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: