ఈ మధ్య కాలంలో బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ లేకుండా పోతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో.అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడంతో అక్రమ సంబంధానికి తెరలేస్తుంది. ఇక అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు కూడా రోజురోజుకు పెరిగిపోతోన్నాయి . తాజాగా హైదరాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మల్కాజ్గిరి పరిధిలో అదృశ్యమైన ఓ మహిళ... ఏకంగా ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే సదరు వ్యక్తి కూడా వివాహం జరిగింది. ఇద్దరు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే... మల్కాజ్గిరి యాదవ్ నగర్ కు చెందిన డ్రైవర్ శంకర్ అతని భార్య సంతోషీ మంగళవారం రోజు గొడవ పడ్డారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన భార్య తాను చచ్చిపోతాను అంటూ... చెప్పి తన చావుకు ఎవరూ బాధ్యులు కాదు అంటూ సూసైడ్ నోట్ రాసి వెళ్ళింది. అయితే కోపంతో మళ్ళీ సాయంత్రం వరకు తిరిగి వస్తుంది అనుకున్న భార్య తిరిగి రాకపోవడంతో భర్త మల్కాజ్గిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఇక అదే రోజు సాయంత్రం మాసాయిపేట బంగారమ్మ దేవాలయం సమీపంలో భార్య సంతోషి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది
మొదట వీరి మృతదేహాలను గుర్తుపట్టక పోగా ఆ తర్వాత పోలీసుల విచారణలో అక్కడ ఉన్న మహిళా సంతోషీ గా గుర్తించారు పోలీసులు. ఇక ఆమెతోపాటు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి మల్కాజిగిరిలో మిర్జాలలగూడకు చెందిన సాయినాథ పురం లోని రవికుమార్ గుర్తించారు. పదేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం కొనసాగుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.