ఇక ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిగింది అన్న సంతోషం సదరు మహిళ పోలీస్ అధికారి కి ఎక్కువ రోజులు ఉండలేదు ... భర్త నట్టేట్లో ముంచేసి పరారు కావడంతో భర్త కోసం బాధితురాలు తల్లడిల్లుతోంది. మోసపోయానని గ్రహించి డీజీపీని ఆశ్రయించింది బాధితురాలు. ఈ దారుణ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లా కలికోట పోలీస్ స్టేషన్ లో ... ఎస్సైగా పనిచేస్తున్న సిల్లు దాల అనే వ్యక్తి తనను మోసం చేశాడు అంటూ ఓ మహిళా ఎస్సై డిజిపిని ఆశ్రయించాడు, 2017లో భువనేశ్వర్ లో పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో.. సెల్లుదాలా తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అంతలోనే మాయమాటలు చెప్పి మహిళను లొంగదీసుకున్నాడు సెల్లుదాలా .
కానీ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని సదరు మహిళ కోరడంతో నిరాకరించాడు, దీంతో వెంటనే బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు కలుగజేసుకోవటం తో ఆమెను పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకొని ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక పది నెలల పాటు మహిళ తో కాపురం చేసిన భర్త తర్వాత కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ డీజీపీ ని ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి