ప్రస్తుతం ఎన్నో కంపెనీలు కార్మికులతో శ్రమదోపిడి చేస్తున్నాయి అన్న వాదనలు కూడా ఎన్నో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణ పనివేళలు కంటే ఎక్కువ పనిగంటలు పని చేయించుకుంటూ తక్కువ వేతనం చెల్లిస్తున్నారు ఎన్నో కంపెనీలు. ఈ క్రమంలోనే ఆయా కంపెనీలు కార్మికుల పనివేళలు విషయంలో పాటించాల్సిన నిబంధనలు గురించి కేంద్ర కార్మిక శాఖ ఎప్పటికప్పుడు సూచనలు హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అయినప్పటికీ కొన్ని కంపెనీలలో  మాత్రం మార్పు రాదు. ఏకంగా  సాధారణం కంటే ఎక్కువ పనిగంటలు కార్మికులతో పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తూ ఉంటారు.



 కేంద్ర కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ఒక వారం సమయంలో కార్మికులు చేయాల్సిన పని గంటల కంటే ఎక్కువ సమయం కార్మికులతో పని చేయించుకుంటూ.. చివరికి శ్రమ దోపిడీ చేస్తూ ఉంటాయి ఎన్నో కంపెనీలు ఇక తాజాగా కార్మికుల పనివేళలు పై కేంద్ర కార్మిక శాఖ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి కార్మికులందరికీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజుల పాటు  ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మంది కార్మికులకు కేంద్ర కార్మిక శాఖ తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనలు ఎంతగానో ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 కార్మికుల పనివేళలు పై కేంద్ర కార్మిక శాఖ తీసుకు వచ్చిన కొత్త ప్రతిపాదనల ప్రకారం ఒక కార్మికుడు అన్ని రకాల విరామాలతో కలిపి రోజుకు 12 గంటలు మాత్రమే పని చేయాలి.  వారంలో గరిష్టంగా రోజుకు ఎనిమిది గంటల చొప్పున కేవలం 48 గంటలు మాత్రమే కార్మికుడు పనిచేయాల్సి ఉంటుంది ఒక రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి. ఒకవేళ కార్మికుడు అదనంగా పని చేసినప్పుడు ఓటి  అలవెన్స్ లభిస్తుంది అంటూ కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదన తీసుకు వచ్చింది. ఇక ఏ కార్మికుడు  కూడా అరగంట విరామానికి ముందు 5 గంటలు పని చేయకూడదు అంటూ స్పష్టం చేసింది కేంద్ర కార్మిక శాఖ. అన్ని కంపెనీలు ఈ ప్రతిపాదనలను అమలు చేయాలి అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: