కలిసికట్టుగా తిరగడం, స్నానాలను ఆచరిస్తుండడంతో అధికారులు.. మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. అసలే కార్తీకమాసం కావడంతో.. రోజురోజుకు భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ పోతోంది. తుంగభద్రతీరంలో వెలిసిన ప్రసిద్ధపుణ్యక్షేత్రం మంత్రాలయానికి తరలివస్తున్న భక్తులు.. పుణ్యస్నానాలు ఆచరించి రాఘవేంద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమ, శుక్రవారాలతో పాటు వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు… అందరికీ స్క్రీనింగ్ టెస్టును మస్ట్ చేశారు. నగరేశ్వర స్వామి ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డుకు కరోనా సోకడం అలజడి రేపినా…. సహచరులకు నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
దేశంలోని 12 ప్రముఖ నదుల్లో... ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కరం జరుగుతుంది. ఈ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 20తో ప్రారంభమైన ఈ పుష్కరాలు డిసెంబర్ 1 వరకు కొనసాగనున్నాయి. నిజానికి పుష్కరాలతో సంబంధం లేకుండా తుంగభద్రా నది ఒడ్డున ఏడాది పొడుగునా ఎక్కడో అక్కడ కల్యాణాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుంటాయి. అందుకనే తుంగభద్రా నదిని పర్వదిన నదిగా భావిస్తుంటారు. సుమారు 147 కిలోమీటర్ల పొడవున పారే ఈ నది రెండు నదుల సంగమం. తుంగ, భద్రా నదులు కలిసి ప్రవహిస్తుండడం వల్ల ఈ నదికి తుంగభద్ర అనే పేరు స్థిరపడింది.