విశాఖ ఈస్ట్ ఎసిపి హర్షత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఓమ్మి ఆర్కే ఆసుపత్రిలో నలుగురు సిబ్బంది రెమిడిసివర్ ఇంజక్షన్లు అమ్ముతు పట్టుపడ్డారు అని ఆమె వెల్లడించారు. వారి మీద 409,420,R/w34 సెక్షన్లు కింద కేసు నమోదు చేసాము అని మీడియాకు వివరించారు. నాలం సర్వేశ్వర రావు, ఇనుపసప్పల వెంకటరావు, సందడి సింధు, గోరపతి దివ్యకృప ఈ నలుగుర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాము అని ఆమె పేర్కొన్నారు. ఎవరైన వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాట్సప్ స్టేటస్ పెడితే వారిని కాంటాక్ట్ చేసెవాళ్ళు అని అన్నారు.

తమ దగ్గర ఉన్నాయంటు ఎక్కువ మొత్తానికి అమ్మే వాళ్ళు అని వివరించారు. ఇప్పటి వరకు 7 ఇంజక్షన్లు సేల్ చేసారు అని తెలిపారు. కోవిడ్ పెషేంట్లుకు ఇవ్వాల్సిన వాటిని ఇలా సైడ్ చేసి అమ్ముతున్నారు అని వివరించారు. ఒక్కో ఇంజక్షన్ 7 వేల నుండి పది వేలకు అమ్మారు అని తెలిపారు. వారి విధులు సక్రమంగా నిర్వర్తించకుండ ఇంజక్షన్లు పక్కదారి పట్టిస్తే ఎవ్వరిమీదయిన కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు. ఈ లాంటి వ్యవహారాలన్ని ఇంటర్నల్ గా జరిగిపోతున్నాయి..డాక్టర్ చిటీ లేకుండా ఇంజక్షన్లు అమ్మిన సేల్ చేస్తామన్న మా దృష్టికి తీసుకురండి అని సూచించారు.

ఇక ఇదిలా ఉంటే ఈ విషయంలో వైద్యుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. అవసరం ఉన్న లేకపోయినా రెఫర్ చేస్తున్న పలు కార్పోరేట్ ఆసుపత్రుల తీరుపై ప్రభుత్వాలు కూడా సీరియస్ గా ఉన్నాయి.  కరోన సీరియస్ కేసులకు మాత్రమే ఉపయోగించాల్సిన ఇంజక్షన్ అయినా సరే వైద్యులు రోగులను ఇబ్బంది పెడుతున్నారు. అవసరానికి మించి వినియోగిస్తుండటంతో డిమాండ్ , కొరత ఏర్పడుతున్నాయి. బ్లాక్  మార్కెట్ లో అమ్మకాలపై చర్యలు తీసుకుంటామన్న ఆరోగ్యశాఖ చర్యలు ఏమీ కనపడటం లేదు. చాలాచోట్ల దీనిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నారు.  అత్యవసరం అయినప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనుమతి తప్పనిసరి అని చెప్తున్నారు. ముసాపేట లో జనాల రద్దీ దృష్ట్యా  ఔట్ లెట్ షాప్ బంద్ చేయగా వాట్సాప్, ఎస్ ఎం ఎస్ ద్వారా ఆర్డర్లను తీసుకుంటున్నారు. అన్ లైన్ లోను అందుబాటులో ఈ ఇంజక్షన్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: