రామప్ప చారిత్రక సంపద  సంరక్షణ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.  పత్రికల కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు.  సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారించింది.   ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యునెస్కో విధించిన గడువు డిసెంబరు నెలాఖరు వరకు సమగ్ర సంరక్షణ కార్యక్రమం చేపట్టాలని... ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్ లతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపింది.

ఆగష్టు 4న కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని..క్షేత్ర స్థాయిలో సంయుక్త పరిశీలన జరపాలి హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని పేర్కొన్న హైకోర్టు... రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వ కారణమని పేర్కొంది. ప్రపంచ పటంలో స్థానం లభించడం గర్వ కారణమని... ప్రపంచ అంచనాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మారుతుందని.. రామప్ప కట్టడం చారిత్రకంగా అత్యంత విలువైనదని హైకోర్టు కొనియాడింది.

యునెస్కో విధించిన గడువులోగా కార్యాచరణ చేపట్టి శాశ్వత గుర్తింపు దక్కించుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని పేర్కొంది హైకోర్టు. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్న హైకోర్టు..కాలపరిమితులు విధించుకొని పని చేయాలని వెల్లడించింది. ఇక రామప్ప చారిత్రక సంపద  సంరక్షణ కేసు విచారణను ఆగస్టు 25 కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కాగా.. ఇటీవలే... వరంగల్‌ జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపును యునెస్కో ఇచ్చిన సంగతి విధితమే. యునెస్కో గుర్తింపుతో రామప్ప చరిత్ర పూటల్లోకి ఎక్కింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వ మరియు తెలంగాణ ప్రజల కల సాకారం అయింది. దీనిపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రశంసలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: